Maldives: నీరజ్ చోప్రా స్కూబా డైవ్లోనూ జావెలిన్ విసిరాడు
ABN , First Publish Date - 2021-10-02T13:11:50+05:30 IST
ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా మాల్దీవుల్లో స్కూబా డైవ్ చేస్తూ సెలవులు ఆనందంగా గడిపాడు....
మాల్దీవ్స్: ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా మాల్దీవుల్లో స్కూబా డైవ్ చేస్తూ సెలవులు ఆనందంగా గడిపాడు. ఒలింపిక్ క్రీడల అనంతరం నీరజ్ చోప్రా విరామం కోసం మాల్దీవులకు వచ్చి సుందర ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ జావెలిన్ క్రీడ గురించి ఆలోచిస్తున్న నీరజ్ మాల్దీవుల్లోనూ స్కూబా డైవింగ్ చేస్తూ నీటిలోనే జావెలిన్ విసిరాడు. మాల్దీవుల్లోని ఫురవేరి రిసార్ట్లో ఉంటున్న 23 ఏళ్ల నీరజ్ స్కూబా డైవ్ చేస్తూ జావెలిన్ను నీటి కింద విసిరేశాడు. ఈ వీడియోను నీరజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘‘అస్మాన్ పార్, జమీన్ పే, యా నీటి అడుగునా... నేను ఎల్లప్పుడూ జావెలిన్ గురించి ఆలోచిస్తాను... శిక్షణ షురూ హో గై ’’ అంటూ నీరజ్ వీడియోను పోస్టు చేశారు.చోప్రా భారత దేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. దీంతో అతను అలసిపోయాడు. నీరజ్ జ్వరంతో బాధపడ్డాడు.భవిష్యత్ టోర్నమెంట్ల కోసం ఇప్పటికే శిక్షణ ప్రారంభించిన నీరజ్ సెలవుల్లో భాగంగా విరామం కోసం మాల్దీవులకు వచ్చారు.