‘నీట్’ భయానికి మరో విద్యార్థిని బలి
ABN , First Publish Date - 2022-07-17T16:44:13+05:30 IST
రాష్ట్రంలో ఆదివారం ‘నీట్’ జరుగను న్న నేపథ్యంలో, ఈ పరీక్ష కఠినతరంగా ఉంటుందని లేఖ రాసి అరియలూరులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న
ప్యారీస్(చెన్నై), జూలై 15: రాష్ట్రంలో ఆదివారం ‘నీట్’ జరుగనున్న నేపథ్యంలో, ఈ పరీక్ష కఠినతరంగా ఉంటుందని లేఖ రాసి అరియలూరులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. అరియలూరు రైల్వే క్వార్టర్స్లో నివసిస్తున్న నటరాజన్-ఉమ దంపతుల కుమార్తె నిషాంతి గత సంవత్సరం జరిగిన ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో 529 మార్కులు తెచ్చుకుంది. అదే ఏడాది నీట్ రాసినా ఆమెకు సీటు రాలేదు. రెండోసారి పరీక్ష రాసేందుకు తిరుచ్చిలోని ఓ ప్రైవేటు అకాడమీలో శిక్షణ కూడా పొందింది. ఇదిలా ఉండగా, ఈసారి కూడా నీట్ ప్రశ్నలు కఠినంగా ఉం టాయనే భయంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి, వంట గదిలో ఉరేసుకొని మృతిచెందింది. అరియలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.