నీట్‌ ఉచిత శిక్షణ వాయిదా

ABN , First Publish Date - 2022-05-07T15:34:09+05:30 IST

పబ్లిక్‌ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలరోజులు నీట్‌ శిక్షణ తరగతులు నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్య శాఖ తెలిపింది. ప్లస్‌ టూ విద్యార్థులు వైద్యకోర్సుల్లో చేరేం

నీట్‌ ఉచిత శిక్షణ వాయిదా

ఐసిఎఫ్‌(చెన్నై): పబ్లిక్‌ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలరోజులు నీట్‌ శిక్షణ తరగతులు నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్య శాఖ తెలిపింది. ప్లస్‌ టూ విద్యార్థులు వైద్యకోర్సుల్లో చేరేందుకు నీట్‌ ప్రవేశపరీక్షలో ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. కొన్నేళ్లుగా జరిగిన నీట్‌ పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ పొందే విద్యార్థులు మాత్రమే ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారు. వీరిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అర్హత సాధిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నీట్‌పై ఉచిత శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం ప్లస్‌ టూ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు జరుగనుండడంతో తాత్కాలిక వాయిదావేసిన నీట్‌ శిక్షణా తరగతులను జూన్‌లో ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read more