యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-20T05:53:58+05:30 IST

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని నెహ్రూ యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

యోగాతో  సంపూర్ణ ఆరోగ్యం
యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ యువకేంద్ర సభ్యులు, యువజన సంఘాలు

గుంటూరు(తూర్పు), జూన్‌19: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని నెహ్రూ యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువకేంద్ర కార్యాలయంలో యోగాపై శనివారం వర్చువల్‌ విధానం ద్వారా రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్‌లైన్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో  అధికారులు, వలంటీర్లు యోగా తరగతులను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.  యోగా గురు ఆచార్య డాక్టర్‌ కొండయ్య పాల్గొని యోగాభ్యాసాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో యువకేంద్ర రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ ఎ.ఆర్‌.విజయారావు, జిల్లా యువకేంద్ర యువసమన్వయ అధికారి దేవిరెడ్డి కిరణ్మయి, అకౌంట్‌ ప్రోగ్రాం అసిస్టెంట్‌ వినయ్‌కుమార్‌, యువజన సంఘాలు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-06-20T05:53:58+05:30 IST