పోలీసులకు పట్టుబడ్డ రిమాండ్ ఖైదీ హరీష్రెడ్డి
ABN , First Publish Date - 2020-09-22T14:00:16+05:30 IST
పోలీసుల కళ్లు గప్పి పరారైన రిమాండ్ ఖైదీ హరీష్ రెడ్డి బెంగుళూరులో పట్టుబడ్డాడు.
నెల్లూరు: పోలీసుల కళ్లు గప్పి పరారైన రిమాండ్ ఖైదీ హరీష్ రెడ్డి బెంగుళూరులో పట్టుబడ్డాడు. ఈనెల 14 హరీష్రెడ్డి పోలీసుల కళ్లుగప్పి హరీష్ ఆసుపత్రి నుండి పరారయ్యాడు. ఈ నెల 7న బాలుడి కిడ్నాప్ చేసిన కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హరీష్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వద్ద నుండి తప్పించుకొని కారు అపహరించి స్నేహితులతో కలిసి బెంగుళూరుకు హరీష్ రెడ్డి పరారయ్యాడు. అతడి సెల్ టవర్, కార్ ఫాస్ట్రాక్ ఆధారంగా బెంగుళూరు హోస్ పేటలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.