డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీష్ రెడ్డితో ఆత్మీయ సమావేశం
ABN , First Publish Date - 2021-01-16T16:55:12+05:30 IST
జిల్లాలోని జయభారత్ హాస్పిటల్లో డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీష్ రెడ్డితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
నెల్లూరు: జిల్లాలోని జయభారత్ హాస్పిటల్లో డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీష్ రెడ్డితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో డీఆర్డీవో లక్షల లీటర్ల శానిటైజర్ సరఫరా చేశామని తెలిపారు. ఒక్క రోజులో ఆరు లక్షల పీపీఈ కిట్లు తయారు చేశామని, 150 కంపెనీలతో కలిసి 55,000 వెంటిలేటర్లు తయారు చేశామని చెప్పారు. అలాగే 75 టెక్నాలజీస్ రూపొందించామన్నారు. పదకుండు రోజుల్లో వెయ్యి బెడ్ల ఆసుపత్రి నిర్మించి ఇచ్చామన్నారు. ప్రపంచంలో అందరికంటే తక్కవ ఖర్చుతో మనమే వెంటిలేటర్ తయారు చేస్తున్నామని డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.