నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
ABN , First Publish Date - 2021-02-24T19:14:34+05:30 IST
జిల్లా జీజీహెచ్లో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నెల్లూరు: జిల్లా జీజీహెచ్లో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో 200 మంది కార్మికులు విధులను బహిష్కరించారు. జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన తెలుపుతున్నారు.