రేపు నెల్లూరు, బుచ్చి మున్సిపల్ పోలింగ్
ABN , First Publish Date - 2021-11-15T00:53:48+05:30 IST
నెల్లూరు నగర పాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనున్నది.
నెల్లూరు : నెల్లూరు నగర పాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనున్నది. నెల్లూరులో 54 డివిజన్లు ఉండగా ఇప్పటికే 8 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం 46 డివిజన్లకు పోలింగ్ జరగనుండగా, బరిలో 206 మంది అభ్యర్థులు ఉన్నారు. 4,14,302 మంది తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందుకుగాను 384 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో 20 వార్డులకు ఎన్నికలు పోలింగ్ జరగనున్నది. 35 పోలింగ్ కేంద్రాల్లో 35,440 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ విధుల్లో 1289 మంది సిబ్బంది, 1042 పోలీసులు పాల్గొనున్నారు.