నెల్లూరు ఆకుతోట హరిజనవాడలో దారుణం

ABN , First Publish Date - 2020-07-13T18:13:01+05:30 IST

నెల్లూరు : జిల్లాలోని ఆకుతోట హరిజనవాడలో దారుణం చోటుచేసుకుంది.

నెల్లూరు ఆకుతోట హరిజనవాడలో దారుణం

నెల్లూరు : జిల్లాలోని ఆకుతోట హరిజనవాడలో దారుణం చోటుచేసుకుంది. కరెంట్ మెయిన్ లైన్ వైర్లు కిందికి వేలాడుతున్న అధికారులు పట్టించుకోలేదు. గత కొన్నిరోజులుగా స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. అయితే ఇవాళ హైడ్రోజన్ క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్ కార్మికుడు  కిందపడ్డాడు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. ఆ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Updated Date - 2020-07-13T18:13:01+05:30 IST