నెల్లూరు ఆర్డీవో సీరియస్..

ABN , First Publish Date - 2021-08-01T17:41:51+05:30 IST

కావలిలో లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు పాటించడంలేదు. రాత్రి వేళల్లో దుకాణాలు..

నెల్లూరు ఆర్డీవో సీరియస్..

నెల్లూరు జిల్లా: కావలిలో లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు పాటించడంలేదు. రాత్రి వేళల్లో దుకాణాలు, హోటళ్లు బార్లా తెరిచి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో ఆర్డీవో సీరియస్ అయ్యారు. స్వయంగా ఆయనే రోడ్లపై తిరుగుతూ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. మాస్క్ లేకుండా రోడ్లపై తిరిగేవారికి అవగాహన కల్పించారు. లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆర్డీవో పోలీసులకు సూచించారు.

Updated Date - 2021-08-01T17:41:51+05:30 IST