నెల్లూరులో దారుణం

ABN , First Publish Date - 2020-08-15T04:03:53+05:30 IST

నెల్లూరు : నగరంలోని జనార్ధన్ రెడ్డి కాలనీలో దారుణం చోటు చేసుకుంది

నెల్లూరులో దారుణం

నెల్లూరు : నగరంలోని జనార్ధన్ రెడ్డి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కాలనీలోని శివారు పొలాల్లో యువతిపై కొందరు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతిని వివస్త్రని చేసిన దుండగులు పైశాచికంగా వేధించారు. ఈ ఘటనలో యువతికి చేయి విరిగింది. అటుగా వచ్చిన ఓ వ్యక్తి టార్చ్‌లైట్ వేయడంతో నిందితులు ఆటోలో పరారయ్యారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్త్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-08-15T04:03:53+05:30 IST