ఎన్నారైలను టార్గెట్ చేసిన కిలాడీ లేడీ.. అరెస్ట్!

ABN , First Publish Date - 2021-02-27T01:35:08+05:30 IST

నకిలీ ప్రొఫైల్‌తో ఎన్నారైలను టార్గెట్ చేస్తూ డబ్బులను డిమాండ్ చేస్తున్న యువతిని రాచకొండ పోలీ

ఎన్నారైలను టార్గెట్ చేసిన కిలాడీ లేడీ.. అరెస్ట్!

హైదరాబాద్: నకిలీ ప్రొఫైల్‌తో ఎన్నారైలను టార్గెట్ చేస్తూ డబ్బులను డిమాండ్ చేస్తున్న యువతిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన అర్చన హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. కొద్ది రోజుల క్రితం మాట్రిమోనీలో ఫేక్ ప్రోఫైల్‌ను క్రియోట్ చేసిన అర్చన.. ఎన్నారైలను టార్గెట్ చేసి, డబ్బులను డిమాండ్ చేస్తోంది. ప్రొఫైల్‌పై ఆసక్తి చూపిన ఎన్నారైలకు.. తన ఫోన్ నెంబర్ దొరకుండా మొబైల్ సాఫ్ట్‌వేర్ నుంచి ఈ కిలాడీ లేడీ ఫోన్ చేస్తోంది. షార్ట్ వీసాపై ఇండియాకి వచ్చానంటూ నమ్మబలికి.. తనను కలవాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. పలువురిని ఇదే రీతిలో మోసం చేసిన యువతి.. తాజాగా పోలీసులకు చిక్కింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు.. అర్చనను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2021-02-27T01:35:08+05:30 IST