AP: 23వ రోజుకు చేరుకున్న రైతుల మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-23T13:41:11+05:30 IST

రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది.

AP: 23వ రోజుకు చేరుకున్న రైతుల మహాపాదయాత్ర

నెల్లూరు: రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. కొండబిట్రగుంట నుంచి ఉలవపాళ్ల మీదుగా సున్నపుబట్టీ వరకు మహాపాదయాత్ర సాగనుంది. పాదయాత్ర సందర్భంగా రైతులకు మద్దినేని అరవింద్ రూ.లక్ష విరాళం అందించారు. మరోవైపు పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు ఊరూరా ఘన స్వాగతం లభిస్తోంది.  ప్రజలు దూరప్రాంతాల నుంచి వచ్చి మద్దతిస్తున్నారు. మహాపాదయాత్రలో వైసీపీ మినహా అన్ని పార్టీల శ్రేణులు  పాల్గొంటున్నాయి. 

Updated Date - 2021-11-23T13:41:11+05:30 IST