నెల్లూరు జిల్లాలో దారుణం..
ABN , First Publish Date - 2022-01-22T17:50:51+05:30 IST
కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతిలోని దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లికొడుకులైన షేక్ అలీఫ్
నెల్లూరు: కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతిలోని దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లికొడుకులైన షేక్ అలీఫ్ (19), షేక్ మీరమ్మ (42)లను సమీప బంధువే హత్య చేశాడు. ఈ ఘటన అంబటి వారిపాలెంలో కలకలం సృష్టిస్తోంది. మీరమ్మ కుటుంబానికి దగ్గరి బంధువైన రబ్బానీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల కారణంగానే రబ్బానీ ఈ దారుణానికి ఒడిగట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.