నెల్లూరు జిల్లాలో దారుణం..

ABN , First Publish Date - 2022-01-22T17:50:51+05:30 IST

కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతిలోని దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లికొడుకులైన షేక్ అలీఫ్

నెల్లూరు జిల్లాలో దారుణం..

నెల్లూరు: కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతిలోని దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లికొడుకులైన షేక్ అలీఫ్ (19), షేక్ మీరమ్మ (42)లను సమీప బంధువే హత్య చేశాడు. ఈ ఘటన అంబటి వారిపాలెంలో కలకలం సృష్టిస్తోంది. మీరమ్మ కుటుంబానికి దగ్గరి బంధువైన రబ్బానీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల కారణంగానే రబ్బానీ ఈ దారుణానికి ఒడిగట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-22T17:50:51+05:30 IST