నెల్లూరు: పాఠశాలల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-09-09T02:13:11+05:30 IST
జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు
నెల్లూరు: జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వెంకటగిరి గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 6న నలుగురికి కొవిడ్ పాజిటివ్గా వచ్చింది. మొదటిరోజు 80 మంది విద్యార్థినిలకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 18 మందికి కరోనా నిర్ధారణ అయింది. గురుకులంలో మొత్తం 22కు పాజిటివ్ కేసులు చేరాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.