నెల్లూరు: ఎన్నికల అబ్జర్వర్ను కలిసిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2021-04-16T20:23:42+05:30 IST
నెల్లూరు: నగరంలోని ఓ హోటల్లో ఎన్నికల అబ్జర్వర్ దినేష్ పాటిల్ని టీడీపీ నేతలు కలిసారు.
నెల్లూరు: నగరంలోని ఓ హోటల్లో ఎన్నికల అబ్జర్వర్ దినేష్ పాటిల్ని తెలుగుదేశం పార్టీ నేతలు అబ్దుల్ అజీజ్, పనబాక కృష్ణయ్య, చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు కలిశారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ నేతలు వాలంటీర్లతో కరపత్రాలు, డబ్బు, మద్యం వంటివి పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ ఏజెంట్లని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దినేష్ పాటిల్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.