‘Telanganaలో అసలైన రాజకీయ మార్పు జనసేనతోనే!’

ABN , First Publish Date - 2021-10-24T14:43:11+05:30 IST

డబ్బుతో పనిలేని అసలైన రాజకీయ మార్పును జనసేన ద్వారా ...

‘Telanganaలో అసలైన రాజకీయ మార్పు జనసేనతోనే!’

హైదరాబాద్‌ సిటీ : డబ్బుతో పనిలేని అసలైన రాజకీయ మార్పును జనసేన ద్వారా చూడబోతున్నారని జనసేన తెలంగాణ ఇన్‌చార్జి నేమురి శంకర్‌గౌడ్‌ అన్నారు. విద్యార్థులే రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ సాధించే నాయకులుగా మారాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కోరుకున్నారని ఆయన తెలిపారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి విభాగం కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం ఇన్‌చార్జ్‌ శ్రీరాం తాళ్లూరి, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ ఆకుల సుమన్‌, రాష్ట్ర విద్యార్ధి విభాగం అధ్యక్షులు సంపత్‌, రాష్ట్ర విద్యార్ధి విభాగం సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T14:43:11+05:30 IST