నేపాల్‌లో కొత్తగా 1,207 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-27T00:55:35+05:30 IST

నేపాల్‌లో కొత్తగా 1,207 కరోనా కేసులు నమోదు

నేపాల్‌లో కొత్తగా 1,207 కరోనా కేసులు నమోదు

ఖాట్మండ్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నేపాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ నేపాల్ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం రోజు కొత్తగా దేశంలో 1,207 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 71,821 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా వల్ల ఈ రోజు 8 మంది మృతి చెందగా, మొత్తం 467 మంది చనిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో కోవిడ్-19 నుంచి 1,147 మంది కోలుకొగా, మొత్తం 53,013 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఖాట్మండ్ లోయలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 724 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Updated Date - 2020-09-27T00:55:35+05:30 IST