నేటి నుంచి పీజీ కామన్‌ ఎంట్రన్స్‌

ABN , First Publish Date - 2021-10-21T04:41:59+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుగ్రాడియేషన్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానున్నదని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి పీజీ కామన్‌ ఎంట్రన్స్‌

వెంకటాచలం, అక్టోబరు 20 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుగ్రాడియేషన్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానున్నదని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసేందుకు వీఎస్‌యూ పరిధిలోని విద్యార్థులందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. నెల్లూరులోని మూడు సెంటర్లలో మూడురోజుల పాటు వివిధ సబ్జెక్టులకు పరీక్ష జరగనున్నదన్నారు. హాల్‌ టిక్కెట్‌,  ఇతర వివరాలకు కడపలోని యోగి వేమన యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చడమైనదన్నారు. 

Updated Date - 2021-10-21T04:41:59+05:30 IST