బెజవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం
ABN , First Publish Date - 2021-03-03T15:20:45+05:30 IST
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని కించపరచేలా అజాస్వామిక పాలన చేస్తోందని, దీన్ని గమనిస్తున్న..
టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్
విజయవాడ సిటీ : వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని కించపరచేలా అప్రజాస్వామిక పాలన చేస్తోందని, దీన్ని గమనిస్తున్న ప్రజలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ పేర్కొన్నారు. నగరంలో సీపీఐ మద్దతుతో 56 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయంలో దుర్గ ప్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ప్లై ఓవర్ల నిర్మాణం, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్డడం, సూపర్స్పెష్పాలిటీ ఆసుపత్రి, కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక నగర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడారు.