కొత్తగా 540 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-10-15T07:11:22+05:30 IST
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో పదిమంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2059122కి, మరణాల సంఖ్య 14286కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6588 యాక్టివ్ కేసులున్నాయి.