ఏపీలో కొత్తగా 6,151 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-06-18T01:36:52+05:30 IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,151 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం 18,32,902 పాజిటివ్ కేసులు చేరాయి.
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,151 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం 18,32,902 పాజిటివ్ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 57 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 12,167 మంది మృతి చెందారు. ఏపీలో 69,831 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 17,50,904 మంది రికవరీ అయ్యారు.
చిత్తూరులో 12 మంది కరోనాతో మృతి చెందారు. ప్రకాశం 7, గుంటూరు 6, తూర్పుగోదావరి, 5, అనంతపురం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాతో మృతి చెందారు.