భూమిలో నుంచి వింత శబ్ధాలు... తవ్వి చూడగానే...
ABN , First Publish Date - 2020-08-10T11:30:05+05:30 IST
జార్ఖండ్లోని లోహర్దగా జిల్లాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కుడు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రాంతంలో రోడ్డుమీద వెళుతున్న...
లోహర్దగా: జార్ఖండ్లోని లోహర్దగా జిల్లాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కుడు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రాంతంలో రోడ్డుమీద వెళుతున్న ఒక వ్యక్తికి శిశువు రోదన వినిపించింది. అక్కడకు వెళ్లి చూడగా, భూమిలోపలి నుంచి ఈ రోదన వినిపిస్తుదని గ్రహించాడు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. వారంతా అక్కడికి వచ్చి, భూమిలో పాతిపెట్టిన ఆ శిశువును వెలికితీశారు. ఆ శిశువు క్షేమంగానే ఉండటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. తరువాత పోలీసులకు ఈ సమాచారం అందించారు. దీనికి ముందు గ్రామానికి చెందిన పలువురు తల్లులు ఆ శిశువుకు ఆహారం అందించారు. అలాగే ఆ శిశువును దత్తత తీసుకునేందుకు పోటీపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ శిశువును ఆసుపత్రికి తరలించి, ఆ శిశువు తల్లిదండ్రులు ఎవరనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.