రక్షాబంధన్ సందర్భంగా రాజధానిలో తిరగనున్న బస్సులు
ABN , First Publish Date - 2020-08-02T17:49:37+05:30 IST
సోమవారం రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సులను నడపనుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశుభ్రతా చర్యలు పాటిస్తూ...
న్యూఢిల్లీ: సోమవారం రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సులను నడపనుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశుభ్రతా చర్యలు పాటిస్తూ, బస్సులు నడపనున్నట్లు డీటీసీ తెలిపింది. బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సివుంటుంది. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రస్తుతం అన్నిడీటీసీ బస్సులు నడపడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులు నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యకం కల్పించనున్నారు. గత ఏడాది రాఖీ సందర్భంగా కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వచ్చే వారు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సివుంటుంది.