ఢిల్లీలో ఒక్కరోజులోనే 1024 కోవిడ్-19 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-05-29T02:48:15+05:30 IST

ఢిల్లీలో ఒక్కరోజులోనే 1024 కోవిడ్-19 కేసులు నమోదు

ఢిల్లీలో ఒక్కరోజులోనే 1024 కోవిడ్-19 కేసులు నమోదు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా మరో 1024 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తం 16,281 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కరోనా వల్ల 13 మంది చనిపోగా.. మొత్తం 316 మంది మృతి చెందారు. కరోనా నుంచి 7,495 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 8,470 మంది చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2020-05-29T02:48:15+05:30 IST