భద్రాద్రి దేవస్థానం కొత్త ఈవోగా రమాదేవి?
ABN , First Publish Date - 2020-06-30T22:34:15+05:30 IST
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన ఈవోగా దేవాదాయశాఖ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో స్పెషల్గ్రేడ్
నేడు ఉద్యోగ విరమణ చేయనున్న నర్సింహులు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన ఈవోగా దేవాదాయశాఖ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న రమాదేవిని నియమించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా దేవాదాయ శాఖ వరంగల్ డిప్యుటీ కమిషనరుగా, భద్రాద్రి దేవస్థానం ఇన్చార్జ్ ఈవోగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహిస్తున్న జి.నర్సింహులు మంగళవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.