ఆంజనేయస్వామి కొత్త విగ్రహం ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2020-09-27T08:36:03+05:30 IST

పత్తికొండలో దుండగులు ధ్వంసం చేసిన ఆంజనేయస్వామి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని శనివారం ప్రతిష్ఠించారు. గత మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు...

ఆంజనేయస్వామి కొత్త విగ్రహం ప్రతిష్ఠ

పత్తికొండ, సెప్టెంబరు: పత్తికొండలో దుండగులు ధ్వంసం చేసిన ఆంజనేయస్వామి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని శనివారం ప్రతిష్ఠించారు. గత మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేనలు ఘటనను తీవ్రంగా ఖండించారు. బీజేపీ చలో పత్తికొండ పిలుపును ఇవ్వడంతో పట్టణంలో పోలీసు బలగాలు భారీగా మోహరించి నాయకులను స్టేషన్లకు తరలించారు. ధ్వంసం చేసిన విగ్రహం స్థానంలో వైసీపీ నాయకుడు మురళీధర్‌రెడ్డి సొంత ఖర్చులతో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శనివారం వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

Updated Date - 2020-09-27T08:36:03+05:30 IST