పంజాబ్లో కొత్త పొత్తు
ABN , First Publish Date - 2021-06-13T08:53:04+05:30 IST
పంజాబ్ రాజకీయాల్లో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2022లో జరగనున్న
పంజాబ్లో బీఎస్పీతో అకాలీదళ్ దోస్తీ
బీఎస్పీతో జత కట్టిన అకాలీదళ్
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ
కాంగ్రె్సను గద్దె దించుతాం: బాదల్
చండీగఢ్, జూన్ 12: పంజాబ్ రాజకీయాల్లో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్పార్టీ (బీఎస్పీ)తో కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రెండు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్చంద్ర మిశ్రా శనివారం సంయుక్తంగా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.