మహీంద్రా నుంచి కొత్త శ్రేణి వరి నాట్ల యంత్రాలు

ABN , First Publish Date - 2021-06-19T05:44:33+05:30 IST

తెలంగాణ మార్కెట్లోకి మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫామ్‌ ఎక్వి్‌పమెంట్‌ విభాగం కొత్త శ్రేణి వరి నాట్ల యంత్రాలను ప్రవేశపెట్టింది.

మహీంద్రా నుంచి కొత్త శ్రేణి వరి నాట్ల యంత్రాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ మార్కెట్లోకి మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫామ్‌ ఎక్వి్‌పమెంట్‌ విభాగం కొత్త శ్రేణి వరి నాట్ల యంత్రాలను ప్రవేశపెట్టింది. యంత్రాలు క్రమ పద్ధతిలో వరి నాట్లు వేయడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, కూలీల సమస్యను అధిగమించవచ్చని కంపెనీ వెల్లడించింది కొత్తగా ప్రవేశపెట్టిన ‘మహీంద్రా ప్లాంటింగ్‌ మాస్టర్‌ ప్యాడీ 4 ఆర్‌ఓ’ ధర రూ.7.5 లక్షలు. 4-వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీ, పవర్‌ స్టీరింగ్‌, 180 డిగ్రీ టర్నింగ్‌ రేడియస్‌ కొత్త శ్రేణి యంత్రాల ప్రత్యేకత. చిన్న రైతుల కోసం ‘మహీంద్రా ఎంపీ461’ యంత్రాన్ని విడుదల చేసింది. దీని ధర రూ.2.8 లక్షలు.

Updated Date - 2021-06-19T05:44:33+05:30 IST