సచివాలయాల ద్వారా నూతన రేషన్‌ కార్డులు

ABN , First Publish Date - 2020-09-18T07:39:34+05:30 IST

నూతన రేషన్‌కార్డులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ఒక్కరోజులోనే అందించాలని తహసీల్దార్‌ కె.చిరంజీవి ఆదేశించారు. గురువారం ఒంగోలు మండలం

సచివాలయాల ద్వారా నూతన రేషన్‌ కార్డులు

ఒంగోలు(రూరల్‌), సెప్టెంబరు 17: నూతన రేషన్‌కార్డులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ఒక్కరోజులోనే అందించాలని తహసీల్దార్‌ కె.చిరంజీవి ఆదేశించారు. గురువారం ఒంగోలు మండలం వ లేటివారిపాలెంలో గురువారం గ్రామసచివాలయం ద్వారా ఒక్కరోజులో రేష న్‌ కార్డులు మంజూరు చేశారు.


ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ రేషన్‌కార్డు దరఖాస్తులను వీఆర్వో పరిశీలించి ఆన్‌లైన్‌లో  తహసీల్దార్‌కు పంపాలని, అర్హత గల వారికి అదే రోజు రేషన్‌కార్డు అందజేస్తామని చెప్పా రు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు నల్లమోతు రాఘవ, డిజిటల్‌ అసిస్టెం ట్‌ హేమలత, వలంటీర్‌ యామిని రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T07:39:34+05:30 IST