18న తమిళనాడు నూతన గవర్నర్ ప్రమాణస్వీకారం..
ABN , First Publish Date - 2021-09-15T15:49:23+05:30 IST
చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్గా నియమితులైన ఆర్ఎన్ రవి ఈనెల 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. భన్వరీ లాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో నాగాలాండ్
చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్గా నియమితులైన ఆర్ఎన్ రవి ఈనెల 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. భన్వరీ లాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో నాగాలాండ్ గవర్నర్గా ఉన్న ఆర్ఎన్ రవిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 1976 కేరళ బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవి సీబీఐలో ఇంటెలిజెన్స్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. తర్వాత 2019లో నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు.
నాగలాండ్కు చెందిన ఉగ్రవాద సంస్థలతో శాంతి కోసం జరిగిన చర్చల్లో రవి కీలకపాత్ర పోషించి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎన్ రవి ఈనెల 18న రాష్ట్ర గవర్నర్గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో జరిగే కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొంటారు.