ఎస్ఆర్ నగర్ స్వప్న ఆత్మహత్య కేసులో న్యూ ట్విస్ట్

ABN , First Publish Date - 2020-02-09T16:48:57+05:30 IST

హైదరాబాద్‌: ఎస్‌ఆర్‌నగర్‌లో స్వప్న హత్యకేసులో కొత్త కోణం వెలుగు చూసింది. స్వప్న భర్త అరుణ్‌ తమతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎస్ఆర్ నగర్ స్వప్న ఆత్మహత్య కేసులో న్యూ ట్విస్ట్

హైదరాబాద్‌: ఎస్‌ఆర్‌నగర్‌లో స్వప్న ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. స్వప్న భర్త అరుణ్‌ తమతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్వప్న స్నానం చేస్తుండగా ప్రశాంత్‌ అనే యువకుడు.. వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేశాడని ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో స్వప్న కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే అరుణ్ ఇచ్చిన ఫోన్‌ నంబర్లు ఫేక్‌ అని పోలీసులు గుర్తించారు. తాజాగా అరుణ్‌ వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని స్వప్న కుటుంబసభ్యులు వాపోతున్నారు. స్వప్న భర్త అరుణ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2020-02-09T16:48:57+05:30 IST