హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2022-01-26T22:08:35+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను  పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు గజేంద్ర విపులల కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు  చర్యలు చేపట్టారు. హైదరాబాదులో బడా పారిశ్రామికవేత్తలుగా గజేంద్ర విపుల్ కొనసాగుతున్నారు. టోనీ దగ్గర్నుంచి కొన్నేళ్లుగా వారు డ్రగ్స్ తీసుకుంటున్నారు. హైదరాబాదులో 500 కోట్ల పైచిలుకు వ్యాపారాన్ని ఈ వ్యాపారవేత్తలు చేస్తున్నారు. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 15 మంది వ్యాపారవేత్తల వివరాలను సేకరిస్తున్నారు. వారు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-01-26T22:08:35+05:30 IST