న్యూ ఇయర్‌ వేడుకల్లో ఘర్షణ: యువకుడి హత్య

ABN , First Publish Date - 2022-01-02T15:54:00+05:30 IST

గుడియాత్తం సమీపం కొత్తపారికుప్పంకు చెందిన వినీత్‌ (23), అదే గ్రామానికి చెందిన ఆకాష్‌ (22) స్నేహితులు. వినీత్‌ హోసూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ న్యూ ఇయర్‌ సెలవుకు ఇంటికి వచ్చాడు.

న్యూ ఇయర్‌ వేడుకల్లో ఘర్షణ: యువకుడి హత్య

వేలూరు(చెన్నై): గుడియాత్తం సమీపం కొత్తపారికుప్పంకు చెందిన వినీత్‌ (23), అదే గ్రామానికి చెందిన ఆకాష్‌ (22)  స్నేహితులు. వినీత్‌ హోసూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ న్యూ ఇయర్‌ సెలవుకు ఇంటికి వచ్చాడు. కొత్త సంవత్సరం సందర్భంగా వినీత్‌, ఆకాష్‌, మరి కొందరు స్నేహితులు శనివారం అర్థరాత్రి 12 గంటలకు కేక్‌ కట్‌ చేసే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో, ఆగ్రహానికి గురైన ఆకాష్‌ కత్తితో వినీత్‌పై దాడిచేయడంతో తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అతనిని గుడియాత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మేల్‌పట్టి పోలీసులు ఆకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-01-02T15:54:00+05:30 IST