హోటల్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం వెళ్లిన బాలిక.. ఉదయం లేచి తన పరిస్థితి చూసుకుని షాక్.. మూడ్రోజుల తర్వాత..

ABN , First Publish Date - 2022-01-05T22:30:07+05:30 IST

ఆ బాలిక మోడల్‌గా పనిచేస్తోంది.. వయసు ఇంకా 18 సంవత్సరాలు దాటలేదు..

హోటల్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం వెళ్లిన బాలిక.. ఉదయం లేచి తన పరిస్థితి చూసుకుని షాక్.. మూడ్రోజుల తర్వాత..

ఆ బాలిక మోడల్‌గా పనిచేస్తోంది.. వయసు ఇంకా 18 సంవత్సరాలు దాటలేదు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం తన ఫ్రెండ్‌తో కలిసి ఓ హోటల్‌కు వెళ్లింది.. అక్కడ ఇతరులతో కలిసి మద్యం సేవించింది.. రాత్రికి అక్కడే ఉండిపోయింది.. ఉదయం లేచి చూసే సరికి ఆమెకు పరిస్థితి అర్థమైంది.. తనపై హోటల్ ఓనర్ అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుసుకుంది. అతడిని అడిగితే బెదిరింపులకు దిగాడు. డబ్బు ఆశ చూపించాడు. మూడ్రోజులు ఆలోచించుకున్న తర్వాత ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. 


రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ మైనర్ మోడల్ న్యూ ఇయర్ వేడుకల కోసం ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ మద్యం మత్తులో హోటల్ ఓనర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కూడా మద్యం మత్తులో ఉండడంతో ఆమెకు తెలియలేదు. ఉదయం లేచిన తర్వాత ఆమెకు మొత్తం గుర్తుకు వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. హోటల్‌కు చెడ్డ పేరు వస్తుందనే భయంతో యజమాని ఆమెను ప్రాథేయపడ్డాడు. డబ్బు ఇస్తానని ఆశ పెట్టాడు. 


లొంగకపోవడంతో చంపేస్తానని బెదిరించాడు. మూడ్రోజుల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండిపోయిన బాధిత బాలిక సోమవారం పోలీసులను ఆశ్రయించింది. హోటల్ యజమాని ధ్రువ్ ప్రజాపతి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమెపై అత్యాచారం జరిగిన రూమ్‌ను సీజ్ చేశారు. అలాగే హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2022-01-05T22:30:07+05:30 IST