యాదాద్రిక్షేత్రంలో న్యూఇయర్‌ రద్దీ

ABN , First Publish Date - 2022-01-02T01:50:18+05:30 IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శనివారం న్యూయర్‌ రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దర్శన

యాదాద్రిక్షేత్రంలో న్యూఇయర్‌ రద్దీ

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శనివారం న్యూయర్‌ రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దర్శన క్యూలైన్లలో ఇష్టదైవాల దర్శనాలకోసం బారులు తీరారు. కొత్త సంవత్సరంలో స్వామివారి దర్శనం చేసుకుంటే ఏడాదంతా శుభప్రదంగా గడుస్తుందనే నమ్మకంతో వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి  దర్శనక్యూలైన్లలో భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తజనులు పెద్దసంఖ్యలో స్వామివారి ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆలయ మండపాలను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రసాదాల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు.

Updated Date - 2022-01-02T01:50:18+05:30 IST