Kanpur Test: కివీస్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌దే పైచేయి

ABN , First Publish Date - 2021-11-27T21:37:10+05:30 IST

భారత్‌తో ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది..

Kanpur Test: కివీస్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌దే పైచేయి

కాన్పూరు: భారత్‌తో ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్లు టామ్ లాథమ్ 95, విల్ యంగ్ 89 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. 


నిన్న తీవ్రంగా చెమటోడ్చినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన టీమిండియా బౌలర్లు నేడు విజృంభించారు. ముఖ్యంగా అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. అక్సర్ పటేల్ 5 వికెట్లు తీసుకోగా, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాకు చెరో వికెట్ లభించింది.

Updated Date - 2021-11-27T21:37:10+05:30 IST