వెల్లింగ్టన్ టెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ ఆధిక్యం ఎంతంటే?
ABN , First Publish Date - 2020-02-22T17:40:20+05:30 IST
వెల్లింగ్టన్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ ఆధిక్యం కొనసాగుతోంది.
బేసిన్ రిజర్వ్ స్టేడియం: వెల్లింగ్టన్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్ 216 పరుగులు చేసింది. ప్రస్తుతం 51 పరుగుల ఆధిక్యంలో కివీస్ జట్టు ఉంది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కెప్టెన్ విలియమ్సన్(89), రాస్ టేలర్(44) రాణించారు. భారత బౌలర్లలో ఇషాంత్ మూడు వికెట్లు తీసుకోగా.. షమి, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. వాట్లింగ్, కొలిన్ డీ గ్రాండ్ హోమ్ క్రీజులో ఉన్నారు.
అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ 165 పరుగులకే ముగిసింది. తొలి రోజు ఆటలో 122 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన కోహ్లీ సేన.. రెండో రోజు మరో 43 పరుగులు మాత్రమే జోడించగలిగింది. జట్టు స్కోర్ 132 పరుగుల దగ్గర వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్(19) రనౌట్ కాగా, సోథీ బౌలింగ్లో అశ్విన్ డకౌట్గా వెనుదిరిగాడు. మరికాసేపటికి రహనే(46) కూడా పెవిలియన్ చేరాడు. సోథీ బౌలింగ్లోనే వాట్లింగ్ చేతికి చిక్కాడు. కొద్దిసేపు కివీస్ బౌలర్లకు మహమ్మద్ షమి(21) అడ్డుకట్ట వేసినా.. ఇషాంత్ శర్మ అవుట్ అవ్వగానే.. తర్వాత బంతికే షమి కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో సౌథీ, జమిసన్ చెరో నాలుగు వికెట్లు తీసుకోగా... ట్రెంట్ బోల్ట్ ఒక వికెట్ తీసుకున్నారు.