భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం

ABN , First Publish Date - 2021-04-08T15:22:45+05:30 IST

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం నుంచి న్యూజిలాండ్ వచ్చే ప్రయాణికులపై ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డెర్న్ తాత్కాలిక నిషేధం...

భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం

న్యూఢిల్లీ : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం నుంచి న్యూజిలాండ్ వచ్చే ప్రయాణికులపై ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డెర్న్ తాత్కాలిక నిషేధం విధించారు. ఏప్రిల్ 11వతేదీ సాయంత్రం 4 గంటల నుంచి భారతదేశం నుంచి ప్రయాణికులను న్యూజీలాండ్ దేశంలోకి అనుమతించమని ఆ దేశ అధికారులు ప్రకటించారు.భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ పౌరులకు కూడా ఈ నిషేధం వర్తించనుంది. ఏప్రిల్ 28వతేదీ వరకు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను న్యూజిలాండ్ దేశంలోకి అనుమతించరు.న్యూజిలాండ్ దేశంలో వెలుగుచూసిన 23 కరోనా కేసుల్లో 17 మంది భారతదేశం నుంచి వచ్చిన ప్రయాణికులే కావడంతో న్యూజిలాండ్ మన ప్రయాణికులపై నిషేధాస్త్రం విధించింది. 


Updated Date - 2021-04-08T15:22:45+05:30 IST