అర్ధరాత్రి దారుణం.. చెత్తకుప్పలో శిశువు మృతదేహాన్ని పడేశారు.. శరీరంపై ఇంజెక్షన్ గుర్తులు ఉండటంతో..

ABN , First Publish Date - 2021-08-02T16:40:08+05:30 IST

చెత్తకుప్పలో శిశువు మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

అర్ధరాత్రి దారుణం.. చెత్తకుప్పలో శిశువు మృతదేహాన్ని పడేశారు.. శరీరంపై ఇంజెక్షన్ గుర్తులు ఉండటంతో..

చెత్తకుప్పలో శిశువు మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అక్కడకు చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని బయటకు తీశారు.. శరీరంపై ఇంజెక్షన్ గుర్తులున్నాయి.. దీంతో సమీప హాస్పిటల్ సిబ్బంది ఎవరో ఈ శిశువును ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన ఆదివారం జరిగింది. 


లక్నోలోని వికాస్‌నగర్ ప్రాంత వాసులకు ఆదివారం ఉదయం ఓ చెత్త కుప్పలో శిశువు మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. శరీరంపై ఇంజెక్షన్ గుర్తులున్నాయి. హాస్పిటల్‌లో పుట్టిన వెంటనే చనిపోయిన శిశువును అర్ధరాత్రి ఎవరో అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. 


Updated Date - 2021-08-02T16:40:08+05:30 IST