కొత్తగా 12 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-29T06:31:09+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు.
అనంతపురం వైద్యం, సెప్టెంబరు 28: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 157583కి చేరింది. ఇందులో 156402 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1092 మంది మరణించారు. ప్రస్తుతం 89 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.