ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-12-03T22:23:54+05:30 IST
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్
అమరావతి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో 20,73,390కి కరోనా కేసులు చేరాయి. కరోనాతో మొత్తం 14,445 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,56,788 మంది రికవరీ చెందారు.