పెళ్లయిన మూడు రోజులకే యువకుడు అదృశ్యం..

ABN , First Publish Date - 2020-05-28T18:59:29+05:30 IST

పెళ్లైనే మూడు రోజులకే ఓ యువకుడు అద్యశ్యమయ్యాడు. ఈ ఘటన కోవెలకుంట్ల పట్టణంలో జరిగింది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని

పెళ్లయిన మూడు రోజులకే యువకుడు అదృశ్యం..

కోవెలకుంట్ల (కర్నూలు): పెళ్లైనే మూడు రోజులకే ఓ యువకుడు అద్యశ్యమయ్యాడు. ఈ ఘటన కోవెలకుంట్ల పట్టణంలో జరిగింది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో రోడ్డులో నివాసం ఉన్న కనక క్రిష్ణయ్యకు కుమారుడు కనక వీరకుమార్‌ (26) ఉన్నాడు. హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తూ ఉండేవాడు. లాక్‌డౌన్‌లోనూ అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో ఈ నెల 24న వీరకుమార్‌కు వివాహమైంది.


కుమారుడికి వివాహమయి.. ఆనందంగా ఉన్న తరుణంలో ఆ కుటుంబానికి ఊహించని షాక్ తగిలినట్టయింది. పెళ్లయిన మూడు రోజులకే.. బుధవారం ఉదయం 10 గంటల నుంచి కుమారుడు వీరకుమార్ కనిపించడం లేదు. బంధువుల ఇళ్లల్లోనూ విచారించారు.. చుట్టుపక్కల ఊళ్లల్లోనూ గాలించారు.. స్నేహితులకు కూడా ఫోన్ చేసి ఆరా తీశారు.. అయినప్పటికీ వీరకుమార్ గురించి ఆ కుటుంబానికి ఏమాత్రం సమాచారం రాలేదు. దీంతో తండ్రి క్రిష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. క్రిష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-05-28T18:59:29+05:30 IST