ఆటోలో గర్భిణీ ప్రసవం.. శిశువు మృతి

ABN , First Publish Date - 2020-08-02T10:04:34+05:30 IST

ఆటోలో గర్భిణీ ప్రసవం.. శిశువు మృతి

ఆటోలో గర్భిణీ ప్రసవం.. శిశువు మృతి

బూర్గంపాడు, ఆగస్టు1: బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలో గల రామాపురం గ్రామానికి చెందిన కుర్సం లక్ష్మీపార్వతి నిండు గర్భిణీ. శనివారం సాయంత్రం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆటోలో మోరంపల్లిబంజర పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. అప్పటికే నొప్పులు ఎక్కువై రక్తస్రావం జరుగుతుండడంతో విధులలో ఉన్న స్టాప్‌నర్సు అమెను పరిశీలించి మాములు ప్రసవం సాధ్యం కాదని భాదిత కుటుంబసభ్యులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాదితురాలిని 108ద్వారా భద్రాచలం తరలించేందుకు 108 సిబ్బందికి సమాచారం ఆందించారు. కాగా పురిటినొప్పులు ఎక్కువ కావడంతో కుటుంసభ్యులు అమెను వారు వచ్చిన ఆటోలోనే భద్రాచలం తరలిస్తున్న క్రమం లో మార్గమధ్యలో ఆటోలోనే ప్రసవించింది. మగశిశువు జన్మనివ్వగా వెంటనే చనిపోయాడు. దీంతో లక్ష్మీపార్వతి కుటుంబసభ్యులు శోకంలో మునిగిపోయారు. కా గా భాదిత కుటుంబసభ్యులు మాట్లడుతూ పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సరైన సమయంలో వైద్యం ఆందకపోవడంతో శిశువు చనిపోయిందని ఆరోపించారు.


Updated Date - 2020-08-02T10:04:34+05:30 IST