కషాయం తాగండి.. కరోనాకు చెక్‌ పెట్టండి

ABN , First Publish Date - 2020-08-02T10:33:08+05:30 IST

కషాయం తాగండి.. కరోనాకు చెక్‌ పెట్టండి

కషాయం తాగండి.. కరోనాకు చెక్‌ పెట్టండి

నంగునూరు, ఆగస్టు 1: నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని ఫంక్షన్‌హాల్‌లో లబ్ధిదారులకు రూ.కోటి 31 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైర్‌సను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కషాయం తాగాలని సూచించారు. కాగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మండలంలోని పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ సారయ్య, మాజీ జడ్పీటీసీ మల్లయ్య, రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, సహకార సంఘం చైర్మన్లు రమే్‌షగౌడ్‌, మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, సర్పంచ్‌కుమార్‌, ఎంపీటీసీ తులసి పాల్గొన్నారు.


సిద్దిపేట టౌన్‌: సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా వద్దకషాయం వితరణ కేంద్రాన్ని శనివారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

Updated Date - 2020-08-02T10:33:08+05:30 IST