ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

ABN , First Publish Date - 2021-12-03T01:18:10+05:30 IST

ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120 కోట్ల భారీ జరిమానా విధించింది.

ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

ఢిల్లీ: ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120 కోట్ల భారీ జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. జరిమానాను 3 నెలల్లో చెల్లించాలాని ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశించింది. 

Updated Date - 2021-12-03T01:18:10+05:30 IST