గుజరాత్‌లో రాత్రి కర్ఫ్యూ ఫిబ్రవరి 4 వరకు పొడిగింపు

ABN , First Publish Date - 2022-01-29T17:00:19+05:30 IST

గుజరాత్‌లో రాత్రి కర్ఫ్యూ ఫిబ్రవరి 4 వరకు పొడిగింపు

గుజరాత్‌లో రాత్రి కర్ఫ్యూ ఫిబ్రవరి 4 వరకు పొడిగింపు

గాంధీనగర్: కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 27 నగరాల్లో ఇప్పటికే ఉన్న నైట్ కర్ఫ్యూని ఫిబ్రవరి 4 వరకు పొడిగిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ సమయం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. గాంధీనగర్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-29T17:00:19+05:30 IST