ఏపీలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ?

ABN , First Publish Date - 2021-04-18T20:27:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఏపీలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పదో తరగతి పరీక్షల రద్దుపై మరి కాసేపట్లో నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మిగిలిన తరగతులు, పరీక్షల విషయంలో కూడా రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులపై ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించే విషయాన్ని కూడా సర్కార్ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో వ్యాపార సంస్థలు బంద్ పాటిస్తున్నాయి.

Updated Date - 2021-04-18T20:27:59+05:30 IST