భోపాల్, ఇండోర్‌లలో నైట్ కర్ఫ్యూ!

ABN , First Publish Date - 2021-03-14T02:12:38+05:30 IST

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర దారిలోనే నడుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న

భోపాల్, ఇండోర్‌లలో నైట్ కర్ఫ్యూ!

భోపాల్ : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర దారిలోనే నడుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు.కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భోపాల్, ఇండోర్ పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయని సీఎం సంకేతాలిచ్చారు. ఆదివారం  లేదా సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని ఎలాగైనా అరికట్టాలి. అన్ని చర్యలూ తీసుకుందాం. అవగాహనా కార్యక్రమాలను నిర్వహిద్దాం. ఆదివారం లేదా సోమవారం నుంచి భోపాల్, ఇండోర్ లో నైట్ కర్ఫ్యూ కూడా విధిద్దాం.’’ అని సీఎం శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. 

Read more