Bengaluru: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో రాత్రి కర్ఫ్యూ రద్దు
ABN , First Publish Date - 2021-11-02T17:54:17+05:30 IST
కొవిడ్ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండడంతో రాజధాని బెంగళూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొవిడ్ నియంత్రణకు సంబంధించిన ఉన్నతస్థాయి సాంకేతి
బెంగళూరు: కొవిడ్ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండడంతో రాజధాని బెంగళూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొవిడ్ నియంత్రణకు సంబంధించిన ఉన్నతస్థాయి సాంకేతిక సలహా సమితి సూచనమేరకు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సోమవారం సూచనప్రాయంగా వెల్లడించారు. దీపావళి అనంతరం రాత్రి కర్ఫ్యూను రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం బెంగళూరుతో సహా పలు జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్ అనంతరం అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను కూడా రద్దు చేయాలని పెద్దపెట్టున ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నట్టు తెలిసింది.